TRENDING NOW





ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలి

ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రతి పత్రిక విలేకరి పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని, వారి పిల్లల విద్యకు ప్రైవేట్ విద్యాసంస్థలు సహకరించాలని ఆయన కోరారు.

మల్లెల శివ నాగేశ్వరరావు
జాతీయ అధ్యక్షులు
కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్


ప్రభుత్వ పురస్కారాల ప్రకటన అభినందనీయం

జర్నలిస్టులను ప్రోత్సహించే చర్యలు కొనసాగాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ను అభినందించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాలు ప్రకటించడం అభినందనీయమని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు పేర్కొన్నారు. బుధవారం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్‌ను సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాలెంపాటి శ్రీనివాసరావుతో కలిసి రంగనాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన జర్నలిస్టులను గుర్తించి ప్రోత్సహించడం సమాజానికి, మీడియా రంగానికి ఎంతో అవసరమన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలు అందించకపోవడం బాధాకరమని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయడం సంతోషకరమన్నారు. ప్రతి ఏడాది ఇటువంటి పురస్కారాలను నిరంతరంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కూడా గత మూడు సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులను గుర్తించి, వారికి పురస్కారాలతో పాటు నగదు బహుమతులు అందజేస్తోందని తెలిపారు. ముఖ్యంగా తక్కువ వేతనాలతో లేదా వేతనాలు లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇటువంటి గుర్తింపులు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.
గతంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు పురస్కారాలు అందజేశామని గుర్తు చేశారు. ఇదే క్రమంలో 2026 సంవత్సరానికి సంబంధించిన “ఉత్తమ తెలుగు జర్నలిస్టు పురస్కారాల” ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సామాజిక బాధ్యతతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంఘం ప్రధాన లక్ష్యమని రంగనాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ప్రోత్సహించే విధంగా పురస్కారాలు, ప్రోత్సాహక కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు. ఆ దిశగా మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పురస్కారాల ప్రకటన జరగడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పార్థసారథి, మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాధన్ తదితరులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుల ప్రోత్సాహానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.


*చిత్తూరు జిల్లా లొ ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి దారుణ హత్యను ఖండించిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు*


*చిత్తూరు జిల్లాలో ఓ పత్రికా విలేకరిని చంపేశారు. వి.కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయాన్నే ఆయన వాకింగ్ చేసే సమయంలో  కొంతమంది వ్యక్తులు వెంటాడి ఇంటికి సమీపంలోనే కత్తులతో నరికి చంపేశారు. ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు..ఇలాంటోళ్ళు నెల్లూరు రూరల్ మండలం లో MLA మాదిరిగా చెలరేగి పోతున్నారు ఈ దారుణ హత్యకు పాల్పడ్డ వ్యక్తులు ఎటువంటి వారైనా సరే వదిలిపెట్టకుండా పోలీసు వారు తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్  అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు*

జర్నలిస్ట్ మిత్రులకు నమస్తే
జర్నలిస్టు సంఘాలు ఆలోచించాలి

అర్హత లేని అవగాహన లేని జర్నలిజం సమాజనికి చేటు తెస్తుoది. పత్రిక యాజమాన్యం డబ్బులు కోసం  ప్రెస్ కార్డులు ఇవొద్దు. జిల్లా సమాచారం శాఖ అధికారులు పర్యవేక్షణ పెంచాలి. 

ఇటీవల అక్రీడేషన్ కార్డుల జారీ పక్రియ మొదలు పెట్టడం తో రోజు కో పత్రిక పేరుతో జర్నలిస్టులు  పుట్టుక వస్తున్నారు. కొత్త వారు ఉన్నారు పాత వారు ఉన్నారు. కనీసం జర్నలిస్ట్ అనే పదం విలువ తెలియని వారు కూడా జర్నలిస్టు అంటూ అవతారంఎత్తుతున్నారు. జర్నలిజం అంటే జనం  అసహించుకొనే స్థాయి తెస్తున్నారు. ఆటో డ్రెవర్, హోటల్ లో క్లీనర్, సెల్ ఫోన్ రిపేర్ చేసే వాడు, పరిశ్రమలలో పని చేసే కార్మికుడు ప్రెస్ కార్డులు పెట్టు కొని జర్నలిస్టు అంటున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా పత్రిక పేరు చెప్పు కొని పబ్బం గడుపు కొనే పరిస్థితి నెలకొంది. నిత్యం ప్రజలను మోసం చేసే వాళ్ళు, ప్రభుత్వ అధికారులను మోసం చేసే వాళ్ళు  దొంగ తనం చేసేవారు, నానా తప్పులు చేసే వాళ్ళు అనేక సందర్భాల్లో  బ్లక్ మెయిల్  చేసే వాళ్ళు విలేకరి అంటూ చెలామణి అవుతున్నారు. వీరి పట్ల జర్నలిస్టు సంఘాలు అప్రమత్తత అవసరం. నిజాలను నిర్భయంగా ఖండిoచాలి. ఇటీవల ఓ నాయకుడు సిగ్గు ఎగ్గు లేని వాళ్ళు జర్నలిజం లోకి వచ్చి మీడియా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఊరుకుంటూ పోతే జర్నలిజం పూర్తిగా దూర్మార్గులకు అడ్డాగా మారుతుందని హెచ్చరించారు. వీళ్ళు సమాజంకు ఎమి సమాచారం చేరవేస్తారు. అనే ఆలోచనలు అందరిలో మెలుగుతూన్నాయి. పోలీస్ రికార్డులో కేసులు ఉన్నవారిని వెంటనే ప్రెస్ కార్డులు జారీ చేయటం మానుకోవాలి, ప్రెస్ యాజమాన్యాలకు జర్నలిస్ట్ సంఘాలు అక్రీడేషన్ కమిటీ లేఖలు రాయాలి. వృత్తి గౌరవం కాపాడాలని సూచించాలి. దొoగ తనం చేసే వాళ్ళకు ప్రతి రోజు సమాజం లో మోసాలకు పాల్పడుతున్నవారికి, డ్రెవర్స్, సెల్ ఫోన్ షాప్ రిపేర్స్ చేసే వాళ్ళకు ఫేక్ సర్టిఫికెట్ పెట్టి కార్డులు పొందూ వారిని సున్నం వేసే పెయింటర్ సైతం విలేకరి అంటూన్న వారినీ పూర్తిగా బహిష్కరణ చేసేలా ఉండాలి. జిల్లా కలెక్టర్ కు జర్నలిస్టు సంఘాలు  తెలుపాలి. జెర్నలిజం ముసుగులో కొనసాగుతున్న నకిలీ విలేకరులను కొనసాగించవద్దు. పత్రిక యాజమాన్యం ఐదు వేలు పదివేలు ఇస్తే ప్రెస్ కార్డులు జారీ చేయకుండా చర్యలు చేపట్టాలి. ఐ అండ్ పిఆర్ కమిషనర్ లేఖలు రాయాలి. నిజమైయిన జర్నలిజంను బ్రతికించాలి. జర్నలిస్ట్ సంఘాలు అక్రీడేషన్ కమిటీ ఇందుకు కృషి చేయాలి.

ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి–జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు

 హైదరాబాద్, కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ 

తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.
జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన పేపర్ కటింగులు విద్యార్హతల సర్టిఫికెట్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కటింగ్లతో పాటు సంబంధిత ఎడిటర్  పత్రికకు వార్తలు రాసినట్లు ధ్రువీకరించే లేఖ సంబంధిత అర్హత పత్రాలను జత చేయడంతో పాటు తాము వేరే ఇతర వృత్తులలో అనగా సొసైటీ చైర్మన్, డైరెక్టర్ ప్రభుత్వ ఉద్యోగం, న్యాయవాద వృత్తి, సర్పంచ్ తదితర ఇతరత్రా ఏ పద
పదవుల్లో కొనసాగడం లేదని సెల్ఫ్ డిక్లరేషన్ జతచేసి హార్డ్ కాపీని సంబంధిత డిపిఆర్ఓ కార్యాలయాలలో అందజేయాలని, అప్లికేషన్‌ను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై సంబంధిత అధికారులకు కఠిన చర్యలకై ఆదేశాలు ఇవ్వనున్నట్లు స్పెషల్ కమిషనర్ వెల్లడించారు
ఇప్పటికే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ రెండు సార్లు సమావేశమై జీఓ అమలు, విధి విధానాలపై చర్చించిందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తూ, అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన జర్నలిస్టులకు కార్డులు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా? వాస్తవాలు - అపోహలు

సమాజంలో జరిగే విషయాలను సేకరించి, విశ్లేషించి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే. జర్నలిజం అనేది ఒక బాధ్యతాయుతమైన వృత్తి. అయితే, *"అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్ట్ అవుతారు"* అనేది సమాజంలో ఉన్న ఒక పెద్ద అపోహ. దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులే. అయితే, ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని *(BPL)* గుర్తించి వారికి మాత్రమే ' *రేషన్ కార్డు'* ఇస్తుంది. దానికి కారణం వారికి కొన్ని రాయితీలు అందించడమే. అంతమాత్రాన, రేషన్ కార్డు లేని వారు దేశ పౌరులు కాకుండా పోరు కదా! జర్నలిజం కూడా సరిగ్గా అంతే. ప్రజల కోసం వార్తలు రాసే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే, కానీ ప్రభుత్వపరమైన నిర్దిష్ట అవసరాల కోసం కొందరికి మాత్రమే ప్రభుత్వం *'అక్రిడేషన్'* మంజూరు చేస్తుంది.
*సంస్థల చట్టబద్ధత - MCA రిజిస్ట్రేషన్:*
వార్తలు అందించే ప్రతి డిజిటల్ మీడియా, పత్రిక లేదా న్యూస్ ఏజెన్సీ చట్టబద్ధంగా పనిచేయాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (MCA) వద్ద ఆయా సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. ఈ MCA రిజిస్ట్రేషన్ అనేది ఆ సంస్థ యొక్క మనుగడకు చట్టబద్ధతను (Legal Entity) కల్పిస్తుంది.
*మరి అక్రిడేషన్ కార్డు దేనికి?:*
మీ వార్తా సంస్థకు MCA రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ, అందులో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం అధికారికంగా కల్పించే కొన్ని సౌకర్యాలు మరియు యాక్సెస్ కోసం ' *అక్రిడేషన్*' అవసరం అవుతుంది. 
*దీని ప్రధాన ఉపయోగాలు ఇలా ఉంటాయి:*
* ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్, అసెంబ్లీ మరియు పార్లమెంట్ సమావేశాలకు అధికారిక ప్రవేశం.
* ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం సేకరించడానికి, ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలను కవర్ చేయడానికి అనుమతి.
* జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు (ఉదాహరణకు CGHS).
* కొన్ని ప్రత్యేక సందర్భాలలో రైల్వే టిక్కెట్లలో మరియు బస్సు ప్రయాణాల్లో రాయితీలు.

 ఒక వార్తా సంస్థను చట్టబద్ధంగా నడపడానికి *MCA రిజిస్ట్రేషన్* ఉపయోగపడుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డంకులు లేకుండా వెళ్లడానికి, సంక్షేమ పథకాలు అందుకోవడానికి *అక్రిడేషన్ కార్డు* ఉపయోగపడుతుంది. అంతేగానీ, సమాజాన్ని ప్రశ్నించే మరియు వార్తలు రాసే అర్హతను కేవలం ఒక కార్డు మాత్రమే నిర్ణయించలేదు. జనం పక్షాన నిలబడే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే.




పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి చిన్న పేపర్ల ఎడిటర్ల మనోవేదన

పల్నాడు జిల్లాలో అటెండెన్స్ తగ్గింది అంటూ అక్రిడెన్స్ లేదంటూ మాయాజాలం...

 గత సంవత్సర కాలం నుండి అటెండెన్స్ ఉన్నప్పటికీ అక్రిడేషన్ కు నోచుకోని పలు చిన్న పేపర్లు 

 డి పి ఆర్ ఓ ఆఫీస్ లో 30 రోజులు పేపర్ వేస్తున్నప్పటికీ 20 రోజులే అటెండెన్స్ పడుతున్న వైనం 

 కార్యాలయంలో పది రోజులు పేపరు మాయమవుతున్నట్లుగా తెలుస్తుంది..

 ఈ విషయంలో అధికారులకు పేపర్ తగ్గుతుందంటూ చెప్పినప్పటికీ పట్టించుకోని అధికారులు...

 అటెండెన్స్ లేని పేపర్లు కూడా అక్రిడేషన్ ఇస్తున్నట్లుగా సమాచారం...

 ఈ విషయమై అధికారులు తెలియజేస్తున్నప్పటికీ సెకండ్ లిస్ట్ అంటూ మాయాజాలం చేస్తున్నారు...

 చిన్న పేపర్లను పట్టించుకోని నరసరావుపేట డి పి ఆర్ ఓ కార్యాలయం...

 కార్యాలయంలో ఎడిటర్ లు వెళ్లి అధికారుల కోసం వేచి చూచినా కూడా పట్టించుకోని అధికారులు...





 అటెండెన్స్ ఉన్న చిన్న పేపర్లకు అక్రిడేషన్లు ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో దృష్టి సారించి అందరికి న్యాయం చేయాలని పలువురు ఎడిటర్ లు కోరుతున్నారు.