TRENDING NOW







కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా శివ సాయి రామ్ నియామకం

చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా చిలకలూరిపేట మల్లెల న్యూస్ ఎడ్లపాడు మండల ఇన్‌చార్జి శివ సాయి రామ్ను నియమించారు.

అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు శివ సాయి రామ్‌ను చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అసోసియేషన్ తనకు అప్పగించిన బాధ్యతలను శివ సాయి రామ్ సమర్థవంతంగా నిర్వహిస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

నియామకం పట్ల పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు శివ సాయి రామ్‌కు అభినందనలు తెలిపారు.





కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కాకేసరి ర్యదర్శిగా షేక్ జానీభాష నియామకం 

చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా చిలకలూరిపేట లోకల్ న్యూస్ నాదెండ్ల మండల ఇన్‌చార్జి షేక్ జానీభాషను నియమించారు.

అసోసియేషన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా షేక్ జానీభాషకు పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.





కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా బాలు నాయక్ 

చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా వార్తా లోకం దినపత్రిక పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ బాలు నాయక్ ను నియమించిన జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు 

అసోసియేషన్‌లో ఆయనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలు నాయకులకు పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.







*కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మీడియా ఇన్ఛార్జి నియామకం*


కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మీడియా ఇంచార్జి గా కారుమంచి వీరాంజనేయులు గారిని నియమించటం జరిగింది. 

ఈ సందర్భంగాఏర్పాటు చేసిన సమావేశం లొ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు గారు, చప్పిడి బాలస్వామి గారు పల్నాడు జిల్లా మీడియా ఇంచార్జ్,మరియు కోవటి వాసు గారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ నియామక కార్యక్రమం లొ పాల్గొని కారుమంచి వీరాంజనేయులు గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. 
ఇందు నిమిత్తమై కేసరి యాక్టివ్ ప్రెస్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మీడియా ఇంచార్జ్ కారుమంచి వీరాంజనేయులు గారు మాట్లాడుతూ ఈ సంఘఅభివృద్ధి కొరకు మరియు బాపట్ల జిల్లా నూతన సభ్యులకు తన వంతు కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో తెలిపారు జాతీయ అధ్యక్షులు  మరియు మీడియా మిత్రులందరితో కలిసి పని చేస్తానని తెలియజేయడం జరిగింది. 
ఈ కార్యక్రమము చీరాల, పేరాల,పీపుల్స్ డయాగ్నొస్టిక్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది





*జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు స్కూళ్లలో ఉచిత విద్య అమలుకు ఉత్తర్వులు*


అనంతపురం:అనంతపురం జల్లా లో జర్నలిస్టుల పీలల్లలకు ప్రయివేటు పాఠశాల లో ఉచిత విద్య అమలయ్యేలా కలెక్టర్ ఓ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏపీయూడబ్ల్యూజే పోరాటాల ఫలితంగా కొన్నేళ్లుగా జిల్లా లో ఈ విధానం అమల్లో ఉంది. 2026-27 విద్యా సంవత్సరం లోను ఈ విధానాన్ని అమలు  చేయాలని ఇటీవలే ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, కలెక్టర్ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి ని పరిగణలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం తాజా గా ఈ ఏడాది లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం పై కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల సూరి నాగేశ్వరరావు మరియు యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.




ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలి

ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రతి పత్రిక విలేకరి పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని, వారి పిల్లల విద్యకు ప్రైవేట్ విద్యాసంస్థలు సహకరించాలని ఆయన కోరారు.

మల్లెల శివ నాగేశ్వరరావు
జాతీయ అధ్యక్షులు
కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్





ప్రభుత్వ పురస్కారాల ప్రకటన అభినందనీయం

జర్నలిస్టులను ప్రోత్సహించే చర్యలు కొనసాగాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ను అభినందించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాలు ప్రకటించడం అభినందనీయమని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు పేర్కొన్నారు. బుధవారం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్‌ను సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాలెంపాటి శ్రీనివాసరావుతో కలిసి రంగనాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన జర్నలిస్టులను గుర్తించి ప్రోత్సహించడం సమాజానికి, మీడియా రంగానికి ఎంతో అవసరమన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలు అందించకపోవడం బాధాకరమని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయడం సంతోషకరమన్నారు. ప్రతి ఏడాది ఇటువంటి పురస్కారాలను నిరంతరంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కూడా గత మూడు సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులను గుర్తించి, వారికి పురస్కారాలతో పాటు నగదు బహుమతులు అందజేస్తోందని తెలిపారు. ముఖ్యంగా తక్కువ వేతనాలతో లేదా వేతనాలు లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇటువంటి గుర్తింపులు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.
గతంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు పురస్కారాలు అందజేశామని గుర్తు చేశారు. ఇదే క్రమంలో 2026 సంవత్సరానికి సంబంధించిన “ఉత్తమ తెలుగు జర్నలిస్టు పురస్కారాల” ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సామాజిక బాధ్యతతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంఘం ప్రధాన లక్ష్యమని రంగనాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ప్రోత్సహించే విధంగా పురస్కారాలు, ప్రోత్సాహక కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు. ఆ దిశగా మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పురస్కారాల ప్రకటన జరగడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పార్థసారథి, మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాధన్ తదితరులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుల ప్రోత్సాహానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.